వైసిపి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి..
0 Comments । By Black Cat News । 2 April, 2022
వైసిపి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
నంద్యాల నియోజకవర్గం లో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని మాజీ మంత్రి వర్యులు MLC NMD ఫరూఖ్ గారు, మాజీ మంత్రి వర్యులు ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి గారి అధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించడం జరిగింది.
ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ చార్జీల విషయంలో బాదుడే బాదుడని తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ బాధలు లేకుండా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిన వాగ్దానాలు అన్ని మరచి విద్యుత్ చార్జీలు ఏడు సార్లు పెంచారనీ, వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను, ఆస్తిపన్ను ఇలా అనేక రకాల పన్నులు పెంచుకుంటూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, మాటతప్పను మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది మాట తిప్పినట్లు, మడమ తిప్పినట్లు కాదా అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, వార్డు ఇంచార్జీ లు, నంద్యాల మరియు గోస్పాడు మండలం నాయకులు పాల్గొనడం జరిగింది.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool