×
Login

సాక్షిపై రూ.75కోట్ల‌కు లోకేశ్ ప‌రువున‌ష్టం దావా. నారా లోకేశ్ దావా. .

0 Comments । By Black Cat News । 24 February, 2022

సాక్షిపై రూ.75కోట్ల‌కు లోకేశ్ ప‌రువున‌ష్టం దావా. నారా లోకేశ్ దావా.

*సాక్షిపై రూ.75కోట్ల‌కు లోకేశ్ ప‌రువున‌ష్టం దావా*_

*తెలుగుదిన‌ప‌త్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు.*

★ విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా  దాఖ‌లైంది. 

★ ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో దాఖ‌లైన వ్యాజ్యంలో త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే దురుద్దేశంతో సాక్షి ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించార‌ని దావాలో పేర్కొన్నారు.

★ సాక్షి దిన‌ప‌త్రిక‌లో 2019  అక్టోబ‌ర్ 22న _*``చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి``*_ శీర్షిక‌తో ఓ క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది.

★ అయితే ఆ క‌థ‌నంలో ప్ర‌చురితమైన అంశాల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019  అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు.

★ దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి తిరుగుస‌మాధానం వ‌చ్చింది.

★ దీనిపై సంతృప్తి చెంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు.

★ విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని అయినప్ప‌టికీ త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు.

★ ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని అందులో పేర్కొన్నారు.

★ దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు.

_*సాక్షి ప్రచురించిన కథనాల వివరాలు:*_

15-08-2017 -
సాక్షి రాసింది: 83,816 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, సుజనా చౌదరి కూతురు ఎంగేజ్మెంట్ లో ఉన్నారు

31-10-2017 -
సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో

31-10-2017 -
సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో

18-11-2017 -
సాక్షి రాసింది: 31,322 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉన్నారు: ఈ ఒక్క రోజు మాత్రమే విశాఖపట్నంలో, ఆగ్రీ టెక్ సమ్మిట్ లో

20-11-2017 -
సాక్షి రాసింది: 59,818 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీం పై ప్రసంగం

05-12-2017 -
సాక్షి రాసింది: 21,098 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ

05-12-2017 -
సాక్షి రాసింది: 10,466 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ

31-12-2017 -
సాక్షి రాసింది: 45,234 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో

04-02-2018 -
సాక్షి రాసింది: 67,096 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: అమెరికాలోని న్యూజర్సీలో, ఎన్ఆర్ఐ టిడిపి శ్రేణుల మధ్య మాట్లాడుతూ

28-02-2018 -
సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ

28-02-2018 -
సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ

30-04-2018 -
సాక్షి రాసింది: 47,040 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం

31-05-2018 -
సాక్షి రాసింది: 48,878 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, నిరుద్యోగ బృతి ప్రకటన

30-06-2018 -
సాక్షి రాసింది: 44,122 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: కడపలో జరిగిన, సియం రమేష్ ఉక్కు దీక్షలో ప్రసంగం

31-07-2018 -
సాక్షి రాసింది: 56,742 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, stanford పూర్వ విద్యార్ధుల కలియికలో

26-08-2018 -
సాక్షి రాసింది: 74,392 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ నివాసంలో.

30-09-2018 -
సాక్షి రాసింది: 63,452 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, యువనేస్తం పై రివ్యూ

30-10-2018 -
సాక్షి రాసింది: 79,170 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం

31-01-2019 -
సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ

31-01-2019 -
సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ

20-03-2019 -
సాక్షి రాసింది: 3,928 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: తాడేపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో

31-03-2019 -
సాక్షి రాసింది: 7,246 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: మంగళగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో

30-04-2019 -
సాక్షి రాసింది: 3,108 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఎన్నికలు అయిపోయాయి, హైదరాబాద్ నివాసంలో

31-05-2019 -
సాక్షి రాసింది: 10,396 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam



#

Also Read

×