×
Login

ఇంటి స్థలం విషయంలో రెండు కుటుం బాల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న వాగ్వాదం.

0 Comments । By Black Cat News । 10 April, 2022

ఇంటి స్థలం విషయంలో రెండు కుటుం బాల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న వాగ్వాదం

కోటిపల్లిలో కొట్లాట


తొమ్మిది మందికి గాయాలు


స్థల వివాదంలో ఘర్షణ


పొందూరు: ఇంటి స్థలం విషయంలో రెండు కుటుం బాల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న వాగ్వాదం మంగళవారం కొట్లాటకు దారితీసింది. ఒక కుటుంబం వారు జేసీబీతో చదును చేసేందుకు సిద్ధమవుతుండగా మరో కుటుంబం వారు నిలు పుదల చేయమని వాదులాడటంతో కర్రలు, రాళ్లతో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. పొందూరు మండలం కోటిపల్లిలో కొన్ని రోజుల్లో గ్రామంలో ఉన్న ఖాళీ స్థలం విష యంలో వివాదం నడుస్తోంది. మంగళవారం గొడవ తీవ్రస్థాయికి చేరింది. మాటలతో ప్రారంభమైన వాగ్వాదం రెండు కుటుంబాల బంధువులకు తెలియడంతో ఒక్కసారిగా సంఘటన స్థలానికి చేరుకుని కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘట నలో ఓ కుటుంబానికి చెందిన కోలా నర్సులమ్మ, పైడిరాజు, లొట్టి చింతమ్మలకు తీవ్ర గాయాలు


ఇరువర్గాల కొట్లాట


కావడంతో 108లో రిమ్స్క తరలించారు. మరో కుటుంబానికి చెందిన పోలాకి అసిరినాయుడు, జాక నీలవేణి, పోలాకి బాను, పోలాకి వెంకట రామ కృష్ణ. పోలాకి సంజు, పోలాకి అలివేలుకు కూడా గాయాలు కావడంతో పొందూరులో ప్రభుత్వ ఆస్ప త్రిలో చికిత్స పొందారు. సమాచారం అందుకున్న పొందూరు ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, West Godavari




Also Read

×